ఏపీ శాసనమండలి రద్దుపై కేకే కామెంట్స్

ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ సీఎం జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్రానికి పంపించింది. ఆ తీర్మాణం ఈరోజే కేంద్రానికి చేరాయి. దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సింది. ఇందుకో చాలా సమయం పట్టవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరోవైపు, ఏపీ మండలి రద్దు సరైన చర్య కాదని పలువు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఏపీ మండలి రద్దుపై తెరాస రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు స్పందించారు. ఏపీ శాసనమండలి నిర్ణయం సరైంది కాదు. మండలిపై రూపాయి ఖర్చయినా దండగేనంటూ జగన్ అనడం అనాలోచితం.. అది నాన్సెన్స్ అన్నారు కేకే.