ఆందోళనకారులు రేప్ చేస్తారు.. జాగ్రత్త !

దేశ వ్యాప్తంగా సీసీఏపై రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చెప్పనక్కర్లేదు. షాహీన్‌బాగ్‌ ధర్నా కేంద్రం వద్ద ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలోనే వచ్చిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో ఢిల్లీ మరింతగా వేడెక్కింది. ప్రస్తుతం రాజకీయాలన్నీ షాహీన్‌బాగ్‌ ధర్నా కేంద్రం చుట్టూ తిరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఓ న్యూస్‌ ఏజెన్సీకి పర్వేశ్‌ వర్మ ఇంటర్వ్యూ ఇచ్చారు.

“ఆందోళనకారులు మీ ఇళ్లలోకి చొరబడతారు.. మీ అక్కలు, కూతుళ్లపై అత్యాచారాలు జరుపుతారు.చంపేస్తారు. అప్పుడు మిమ్మల్ని కాపాడేందుకు మోడీ అమిత్‌ షాలు రారు. కాబట్టి మీరు నిర్ణయం తీసుకోండి” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.అంతేకాదు..ఫిబ్రవరి 11 న ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే.. గంటలో షాహీన్‌బాగ్‌ను క్లియర్‌ చేస్తామని వర్మ చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తన నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ భూముల్లో నిర్మించిన మసీదులను నెల రోజుల్లో కూల్చేస్తామని పర్వేశ్‌ వర్మ చెప్పుకొచ్చారు.