బాలీవుడ్ హీరోయిన్స్ తో పవన్ రొమాన్స్


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల కోరికని తీరుస్తున్న సంగతి తెలిసిందే. ఆయన మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పింక్ తెలుగు రిమేక్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు.
 
ఇక పింక్ రిమేక్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తికాకముందే.. క్రిష్ దర్శకత్వంలో మరో సినిమాని మొదలెట్టాడు పవన్. ఈ సినిమా వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని చెబుతున్నారు. ప్యాన్ ఇండియా సినిమా రాబోతుంది. ఈ సినిమా కోసం పవన్ కి జంటగా బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాని తీసుకున్నట్టు తెలుస్తోంది. మరో హీరోయిన్ గా ప్రగ్యా జైశ్వాల్ ని తీసుకున్నారని చెబుతున్నారు. ఈ చిత్రానికి కిరవాణి సంగీతం అందించనున్నారు.