టీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అని ప్రజలు నమ్మారు : కేటీఆర్


తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఏకంగా 120 మున్సిపాలిటీలు, 9కార్పోరేషన్లని తెరాస సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన మేయర్లు, చైర్మన్లతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అని ప్రజలు నమ్మారని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వానికి ఎంత మద్దతు ఉందో మున్సిపల్ ఎన్నికలు నిరూపించాయన్నారు.

అదేసమయంలో ప్రతిపక్ష పార్టీలపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. స్థానిక ఎన్నికలు జరగకుండా ప్రతిపక్షాలు 9 నెలలు అడ్డుపడ్డాయి. బండారం బయటపడుతుందనే ప్రతిపక్షాలు ఎన్నికలని అడ్డుకోవాలని చూశాయి. నోరు తెరిస్తే.. తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం అనే బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో ఊసే లేకుండా పోయింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బీఫారాలు ఇస్తామన్న తీసుకునే దిక్కులేదని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన తెరాస సిద్ధంగానే ఉంటుందని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం కట్టబెట్టిన ప్రజలకి కేటీఆర్ మరోసారి కృతజ్ఝతలు తెలిపారు.