బీసీసీఐ అడ్వైసరీ కొత్త కమిటీ ఇదే.. !

ఇన్నాళ్లు బీసీసీఐ అడ్వైసరీ మెంబర్లుగా సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ ఉండేవారు. ఇప్పుడు వీరి స్థానంలోకి కొత్త సభ్యులు వచ్చేశారు. తాజాగా నూతన క్రికెట్‌ సలహా కమిటీ(అడ్వైజరీ కమిటీ)ని బీసీసీఐ నియమించిది. ఈ కమిటీలో మదన్‌లాల్‌, రుద్రప్రతాప్‌ సింగ్‌ (ఆర్పీ సింగ్), సులక్షణ నాయక్‌ లకి చోటు కల్పించారు. వీరు సంవత్సరం పాటు ఈ విధుల్లో కొనసాగుతారు.

ఈ ముగ్గురు గతంలో భారత క్రికెట్‌కు తమ సేవలందించినవారే. మదన్‌లాల్‌ ఇండియా తరఫున 39 టెస్టులు, 67 వన్డేలకు ప్రాతినిథ్యం వహించాడు. 1983లో భారత్‌ ప్రపంచకప్‌ నెగ్గిన జట్టులో మదన్‌లాల్‌ సభ్యులు. ఆయన జాతీయ జట్టుకు కోచ్‌గా కూడా పని చేశారు. ఆర్‌ పీ సింగ్‌ ఇండియా తరఫున 14 టెస్టులు, 58 వన్డేలు, 10 టీ 20 మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించారు. సులక్షణ తన 11 ఏళ్ల క్రికెట్‌ కేరీర్‌లో భారత్‌ తరఫున 2 టెస్టులు, 46 వన్డేలు, 31 టీ 20 మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించారు.