శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం   

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శంషాబాద్‌ మండలం రాళ్లగూడ వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న బాల్‌రెడ్డి, నర్సింహ మృతి చెందగా, శంకర్‌కు తీవ్రగాయాలయ్యాయి. గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ వస్తుండగా రాళ్లగూడ వద్ద ప్రమాదం జరిగింది. 

బాధితులు రంగారెడ్డి జిల్లా ఫారూఖ్‌నగర్‌ మండలం సోల్‌పేట వాసులుగా గుర్తించారు. ఈప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరొకరి స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగానే ఉందని సమాచారం. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.