చిరు-మోహన్ బాబు గొడవపై మంచు లక్ష్మీ కామెంట్

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, డైలాగ్ కింగ్ మోహన్ బాబుల మధ్య విబేధాలున్నాయనే ప్రచారం చాన్నాళ్లుగా కొనసాగుతోంది. ఐతే, ఆ ప్రచారానికి చెక్ పెడుతూ ఈ యేడాది ప్రారంభంలో చిరు-మోహన్ బాబు ఆలింగనం చేసుకొన్న సంగతి తెలిసిందే. మా నూతన డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ సీన్ జరగింది. ఈ పిక్ ని ఈ దశాబ్ధంలోనే బెస్ట్ పిక్ అని మంచి ఫ్యామిలీ పేర్కొంది.

ఇక ఈ యేడాది, ఈ దశాబ్ధంలో మొదటి నెల చివరి రోజున మంచు లక్ష్మీ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. జనవరి నెలలో తాను సంతోషానికి గురైన అన్ని సంగతులనూ అందులో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ‘మా’ డైరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోహన్‌బాబు-చిరంజీవి ఆలింగనం చేసుకున్న ఓ ఫొటోను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ‘ఈ ఏడాదిలోని మొదటి నెల నేటితో పూర్తి కావొచ్చింది. కొత్త దశాబ్దం.. కొత్త ఏడాది.. నాన్న, చిరు అంకుల్‌ ఆలింగనం చేసుకున్న ఫొటోలతో చాలా అద్భుతంగా ప్రారంభమైందిని పేర్కొంది. అంతేకాదు.. చిరు, నాన్నకి మధ్య ఎలాంటి విబేధాలు లేవని మరోసారి స్పష్టం చేసింది.