కేంద్ర బడ్జెట్ పై పవన్ స్పందన


కేంద్ర బడ్జెట్-2020 వచ్చేసింది. శనివారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ పై రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పెదవి విరిచాయి. తెలుగు రాష్ట్రాలకి పెద్దగా కేటాయింపులు లేవని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఐతే, భాజాపాతో జతకట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం తాజా కేంద్ర బడ్జెట్ పై ప్రశంసలు కురిపించారు.

ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంధ్యం నెలకొని.. ఆ ప్రభావం మనదేశంలో పడిన తరుణంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రగతిని ఆకాంక్షిస్తూ.. ప్రజా శ్రేయస్సుని కోరుకునేలా ఉందని పవన్ అన్నారు. బడ్జెట్ పై పవన్ స్పందనని పత్రికా ప్రకటన, ఓ వీడియో రూపంలో విడుదల చేశారు. పవన్ బడ్జెట్ మాటలని మీరు వీడియోలో వినేయండీ.. !