గుడ్ న్యూస్ : ‘గబ్బర్ సింగ్’ కాంబో రిపీట్


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకి గుడ్ న్యూస్. ‘గబ్బర్ సింగ్’ కాంబో రిపీట్ కాబోతుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఇండస్ట్రీ రికార్డులని బ్రేక్ చేసింది. వరుస ప్లాపుల్లో ఉన్న పవన్ ని తిరిగి నిలబెట్టిన సినిమా ఇది. అంతకుమించి చాన్నాళ్ల తర్వాత పవన్ ఫ్యాన్స్ దాహాన్ని పూర్తి స్థాయిలో తీర్చిన సినిమా. సదరు అభిమాని పవర్ ఎలా చూడాలనుకుంటారో.. అచ్చుగుద్దినట్టు అలాగే గబ్బర్ సింగ్ లో లో పవన్ నుంచి చూపించి శభాష్ అనిపించుకొన్నాడు హరీష్. వీరి కాంబోలో మరో సినిమా రావాలని చాన్నాళ్ల నుంచి పవన్ అభిమానులు కోరుకుంటున్నారు.

ఇప్పుడు వారి కోరిక తీరబోతుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటించబోయే రెండో సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. ఈ మేరకు ఆ సంస్థ ట్విటర్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టింది. ”గబ్బర్‌ సింగ్‌’ తర్వాత పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, హరీశ్‌ శంకర్‌ డైరెక్షన్‌లో రానున్న సినిమాను మా బ్యానర్‌లో తెరకెక్కించడం చాలా సంతోషంగా ఉంది. సినిమాకు సంబంధించిన పూర్తి విషయాలను త్వరలో ప్రకటిస్తాం’ అని పేర్కొంది.
 
దాన్ని దర్శకుడు హరీష్ శంకర్ రీ ట్విట్ చేశారు. “మరోసారి.. మరోసారి మేజిక్ ని రిపీట్ చేసేందుకు మీ ఆశీస్సులు కావాలి” అంటూ కామెంట్ పెట్టాడు హరీష్ శంకర్. గత యేడాది హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’ బ్లాక్ బస్టర్ హిట్టయింది. గబ్బర్ సింగ్ తరహా గద్దలకొండ గణేష్ తో వరుణ్ తేజ్ కి హిట్ ఇచ్చాడు. ఇప్పుడు ఏకంగా మరోసారి పవన్ స్టార్ తో జతకట్టబోతున్నాడు. మరోసారి ‘గబ్బర్ సింగ్’ మేజిక్ రిపీట్ కావాలని.. ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ కావాలి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పవర్ ఏంటో మరోసారి నిరూపించాలని ఆకాంక్షిస్తూ.. హరీష్ శంకర్ కి ఆల్ ది బెస్ట్.. !