డీంఎకే కోసం ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌కు రాజకీయ సలహాదారుడిగా ఆయన వ్యవహరించనున్నారు. తమిళనాట 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలపై అనుసరించాల్సి వ్యూహాలు, సలహాలపై స్టాలిన్‌కు సూచనలు ఇవ్వనున్నారు. 

ఏపీలో వైసీపీ ఘన విజయం సాధించడం వెనక ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఫలించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ కోసం, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ కోసం ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నారు. తాజాగా ఆయన డీఎంకే కోసం ఎన్నికల వ్యూహాకర్తగా పని చేసేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. దీనిపై డీఎంకే అధినేత స్టాలిన్‌ కీలక ప్రకటన విడుదల చేశారు. ఐతే, అధికారిక ప్రకటన రావాల్సి  ఉంది.