సెమీస్ లో భారత్-పాక్ ఫైట్


భారత్, పాక్ తలపడుతున్నాయంటే ఆ కిక్కే వేరు. మరోసారి అలాంటి రసవత్తర వినోదాన్ని పంచడానికి ఈ దాయాది దేశాలు సిద్ధమయ్యాయి. అండర్ -19 ప్రపంచకప్ ఫైనల్లో చోటు కోసం భారత్-పాక్ కుర్రాళ్ల పోరు నేడు జరగనుంది. క్వార్టర్స్ లో ఆస్ట్రేలియాను భారత్ ఓడించగా.. అఫ్గానిస్థాన్ పై పాక్ గెలిచింది. వరుసగా మూడో సారి ప్రపంచకప్ ఫైనల్ చేరాలంటే పాక్ గండాన్ని భారత్ దాటాల్సిందే. ఐతే అది అంత ఈజీ కాదు.

టోర్నీలో భారత్ నే ఫేవరేట్ అయినా.. పాక్ జట్టు బలంగానే ఉంది. ఓటమి అనేది లేకుండా సెమీస్ కు చేరాయి పాక్, భారత జట్లు. ఇరు జట్లు బలంగానే కనిపిస్తున్నాయి. ఐతే, దాయాదితో పోరు అంటే తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. దాన్ని తట్టుకుని మన ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేస్తేనే విజయం సాధ్యమవుతుంది.ఈ మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది.