విశాఖలో ‘జాను’ హవా చూశారా ? 


విశాఖలో జాను చిత్రబృందం సందడి చేసింది. శర్వానంద్-సమంత జంటగా నటించిన చిత్రం ‘జాను’. తమిళ్ హిట్ 96కి రిమేక్ ఇది. మాతృక దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. విశాఖలో మరో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించేందుకు జాను చిత్రబృందం విశాఖ వెళ్లింది. అంతకుముందు జాను చిత్రబృందం కాలేజీ స్టూడెంట్స్ ని కలిసింది. ఆ సమయంలో జాను జాను అంటూ విద్యార్థులు హోరెత్తించారు. సమంతపై తమనకున్న అభిమానాన్ని చాటారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.