మెగాస్టార్-మోహన్ బాబు మళ్లీ శత్రువులయ్యారు

మెగాస్టార్ చిరంజీవి, డైలాగ్ కింగ్ మోహన్ బాబుల బంధం ఇటీవలే మరింత బలపడిన సంగతి తెలిసిందే. మా నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సభలో మెగాస్టార్-మోహన్ బాబుల కిస్సు సీన్ హైలైట్ అయింది. తామిద్దరం స్నేహితులమని ఈ ముద్దు సీన్ తో చెప్పేశారు.. ఈ లెజెండ్స్. మంచు ఫ్యామిలీ, ప్రేక్షకులు కూడా ఈ దశాబ్ధం ఆరంభానికిదే హైలైట్ పిక్ అని సంబరపడిపోయారు. 

ఐతే, ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. అవునూ.. మెగాస్టార్-మోహన్ బాబు మళ్లీ శత్రువులయ్యారు. ఐతే, ఈసారి నిజ జీవితంలో కాదు. తెర జీవితంలో. అవునూ.. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రతినాయకుడి పాత్రలో మోహన్ బాబు కనిపించబోతున్నట్టు సమాచారమ్. అందుకే మెగాస్టార్-మోహన్ బాబు మళ్లీ శత్రువులయ్యారని చెప్పుకొంటున్నారు ప్రేక్షకులు.

మెగాస్టార్-మోహన్ బాబు ఇది వరకు బిల్లా రంగా, పట్నం వచ్చిన పతివ్రతలు చిత్రాల్లో హీరోలుగా కలిసి నటించారు. చిరంజీవి హీరోగా నటించిన పలు చిత్రాల్లో మోహన్ బాబు విలనిజం పండించారు. ఇన్నేళ్లకు మళ్లీ వీరిద్దరూ కలిసి నటించడానికి రంగం సిద్ధమవుతోంది. కొరటాల సినిమాలో చిరు,మోహన్ బాబు కలిసి తెరను పంచుకోనున్నారు.

ఈ చిత్రంలో త్రిష కథానాయిగా నటిస్తోంది. యంగ్ హీరోయిన్ రెజీనా ప్రత్యేక గీతంలో కనిపించనుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. జెడ్ స్పీడుతో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు సమాచారమ్.