మార్పింగ్ ఫొటోపై అనసూయ మండిపాటు


హాట్ యాంకర్ అనసూయకి చెందిన ఓ ఫోటోని మార్పింగ్ చేసి.. సోషల్ మీడియాలో వైరల్ చేశారట. దానిపై అనసూయ మండిపడ్డారు. అలాంటి పోస్టులు కనపడితే వెంటనే తెలియజేయాలని ఇన్‌స్టా వేదికగా కోరారు. ”హలో! నాకు సంబంధించిన ఒక ఫొటోను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. ఇదిగో ఇదే అసలైన చిత్రం. దయచేసి ఆ మార్ఫింగ్‌ ఫొటో ఎక్కడ కనపడినా తెలియజేయండి. ధన్యవాదాలు” ని రాసుకొచ్చారు.

ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టుల్లో నటించనున్నట్లు సమాచారం. సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అనసూయ కీలక పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. దీంతోపాటు పవన్‌-క్రిష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమాలోనూ అవకాశం దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజమెంత ? అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.