అండర్-19 వరల్డ్ కప్ : బంగ్లా టార్గెట్ 178

అండర్ -19 ప్రపంచకప్ ఫైనల్ లో యువ భారత్ తక్కువ స్కోర్ కే ఆలవుటయింది. 47.1 ఓవర్లలో యువ  భారత్ జట్టు 177 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత్ జట్టు బ్యాట్స్ మెన్లు జైశ్వాల్ 88, తిలక్ వర్మ 38, ధృవ్ జురెల్ 22 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లు అవిషేక్ దాస్ మూడు వికెట్లు, ఇస్లామ్, షకీబ్ లు రెండు చొప్పున వికెట్లను తీశారు.

బంగ్లాదేశ్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 178 పరుగులు చేయాల్సి ఉంది. ఈ తక్కువ టార్గెట్ ని కాపాడుకోవాలంటే భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.