గొంతులో సపోటా గింజ ఇరుక్కొని బాలుడు మృతి

తెలంగాణలో జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో గొంతులో సపోటా గింజ ఇరుక్కొని ఓ బాలుడు మృతి చెందాడు. మల్లాపూర్ కి చెందిన సుజాత-లింగా గౌడ్ దంపతులకి ఇద్దరు కుమారులున్నారు. వీరి చిన్న కుమారుడు శివకుమార్ సపోటా తింటుండగా గొంతులో గింజ ఇరుక్కుంది. దీంతో శ్వాస ఆడక ఇబ్బంది పడుతున్న బాలున్ని మెట్ పల్లిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స మధ్యలోనే శివకుమార్ మృతి చెందాడు. దీంతో.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.