బ్రేకింగ్ : ఏపీ మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసిన టీడీపీ నేత

ఏపీలో మంత్రి వనిత సంతకాన్ని ఫోర్జరీ చేసి అడ్దంగా దొరికిపోయాడు కడపజిల్లాకి చెందిన టీడీపీకి నేత. మంత్రి సరిత లెటర్ ప్యాడ్ పై తనకి అసైన్డ్‌ భూమి కేటాయించాలని కలెక్టర్‌కు లేఖ అందజేశాడు. అనుమానం వచ్చిన కలెక్టర్ మంత్రి వనితకి ఫోను చేసి ఆరా తీశారు. ఈ న్యూస్ తో షాక్ గురైన మంత్రి వనిత.. తాను ఎవరికి భూములు కేటాయించమని లెటర్ ప్యాడ్ ఇవ్వలేదని.. తన సంతకాన్ని ఫోర్జరీ చేసినవారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి వనిత ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. ఫోర్జరీకి పాల్పడిన టీడీపీ నేత అదుపులోనికి తీసుకునేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. లెటర్ ప్యాడ్ పై అచ్చగుద్దినట్టు మంత్రి వనిత సంతకాన్ని దించేశాడు సదరు తెదేపా నేత. ఆయనకి ఇదే హ్యాబీనా.. ? లేక ఇలా ప్రయత్నించి తొలి ప్రయత్నంలోనే దొరికిపోయారా ? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలనుంది.