త్రివేణి సంగమం వద్ద పూజలు చేసిన సీఎం కేసీఆర్ 

కాళేశ్వరం పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. కరీంనగర్ నుంచి సీఎం హెలికాప్టర్ లో కాళేశ్వరం చేరుకున్నారు.ఏరియల్‌ సర్వే ద్వారా సీఎం కేసీఆర్‌ మేడిగడ్డ జలాశయం, కన్నేపల్లి పంప్ హౌస్ లను వీక్షించరు. అనంతరం గోదావరి పుష్కరఘాట్ కు చేరుకుని త్రివేణి సంగమం వద్ద పూజలు చేశారు. ప్రాణహిత-గోదావరి పవిత్ర జలాలను తలమీద చల్లుకున్నారు.

అనంతరం ముక్తేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ కు వేదపండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ముక్తేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లక్ష్మీ బ్యారేజీని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటనలో సీఎస్ సోమేశ్ కుమార్, రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.