మోహన్ బాబు పాత్రపై క్లారిటీ ఇచ్చిన కొరటాల

మెగాస్టార్ చిరంజీవి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు మధ్య విబేధాలున్నాయనే గాసిప్ ఒక్కటి టాలీవుడ్ లో చక్కర్లు కొట్టేది. దానికి ఈ యేడాది ప్రారంభంలోనే పులిస్టాప్ పెట్టారు.. ఈ ఇద్దరు నటులు. జనవరిలో జరిగిన ‘మా’ నూతన డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో చిరు.. మోహన్ బాబుని ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని.. ముద్దుపెట్టారు. దాంతో.. మా మధ్య ఎలాంటి విబేధాలు లేవని క్లారిటీ ఇచ్చారు. ఆ కిస్ సీన్ ఫోటో ఈ దశాబ్ధం ఆరంభానికే బెస్ట్ పిక్ అనిపించుకుంది.

ఇది జరిగిన కొద్దిరోజులకే మరో గుడ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే.. ? చిరు, మోహన్ బాబు తెరపై మరోసారి తలబడపోతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగాస్టార్ చిరంజీవి సినిమాలో మోహన్ బాబు విలన్ గా కనిపించబోతున్నారనే ప్రచారం మొదలైంది. ఈ ప్రచారాన్ని ఎవరు ఖండించకపోవడం.. అది నిజమే అనుకున్నారు. కానీ, అందులో వాస్తవం లేదట.

ఈ మేరకు చిరు152 చిత్రబృందం క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. తమ సినిమాలో మోహన్ బాబు నటిస్తున్నాడనే వార్తలు అవాస్తవం. మోహన్ బాబుకు తగ్గ క్యారెక్టర్ తమ సినిమాలో లేదు. ఒకవేళ ఆయనకు తగ్గ క్యారెక్టర్ ఉంటే తప్పక సంప్రదించే వాళ్లమని చిత్రబృందం తెలిపింది. దీంతో మోహన్ బాబు- చిరంజీవి తెరపై కలబడితే చూడాలన్న ప్రేక్షకుల ఆశలు అడియాశలు అయ్యాయ్. 

ఇక ఈ సినిమా కోసం ఆచార్య అనే టైటిల్ ప్రచారంలో ఉంది. చిరుకి జంటగా త్రిష నటిస్తోంది. యంగ్ హీరోయిన్ రెజీనా ప్రత్యేకగీతంలో మెరవనుంది. రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్ర 40నిమిషాల పాటు ఉండనుంది. ఆయన నక్సలైట్ గా కనిపిస్తారు. చరణ్  కి  జోడీగా సమంత లేదంటే బాలీవుడ్ హీరోయిన్స్ లో కైరా అద్వానీ, శ్రద్దా కపూర్ లలో ఒకరు కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది.