మన మురికి ట్రంప్’కి కనిపించకుండా..!


అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో భారత పర్యటనకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 24న ట్రంప్ గుజరాత్ లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కలిసి అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి గాంధీనగర్ వరకు రోడ్ షోలో పాల్గొననున్నారు. అయితే విమానాశ్రయం నుంచి గాంధీనగర్ కు వెళ్లే మార్గంలో దేవ్ శరణ్ అనే మురికివాడ ఉంది. ఇక్కడ 500లకు పైగా గుడిసెల్లో 2,500 మంది నివసిస్తున్నారు.
 
ఈ గుడిసెలు ట్రంప్ నకు కన్పించకుండా ఉండేందుకు రహదారి పొడవున దాదాపు అర కిలోమీటరు మేర 6 నుంచి 7 అడుగుల ఎత్తులో గోడ నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 16 రోడ్లకు మరమ్మతులు చేయడంతో పాటు విద్యుత్తు లైట్లతో అలంకరించనున్నారు. వీటన్నింటి కోసం దాదాపు రూ. 50కోట్లు ఖర్చు చేస్తున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు ప్రచురితం అవుతున్నాయి. మురికివాడ కనిపించకుండా గోడ కట్టడానికి బదులుగా.. అవే డబ్బులు పెట్టి మురికివాడలో నివసిస్తున్న పేదలకి పక్కా ఇల్లు కట్టించొచ్చు కదా.. ! వాళ్లు ప్రధాని మోడీ ఫోటోతో పాటు ట్రంప్ ఫోటోని ఇళ్లలో పెట్టుకొంటారు.