భీష్మ ట్రైలర్ వాయిదా.. ఎందుకంటే ?

వెంకీ కడుముల దర్శకత్వంలో నితిన్‌-రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. మహతి సాగర సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిరిస్తోంది. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచించి చిత్రబృందం. నితిన్, రస్మిక మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక ఇవాళ సాయంత్రం 4:05గంటలకి ట్రైలర్ ని విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. కానీ విడుదల చేయలేదు.

అది కాస్త ఈ సాయంత్రం 6:30 గంటలకి వాయిదా పడింది. కొన్ని సాంకేతిక కారణాల వలన ట్రైలర్ విడుదల ఆలస్యం అవుతుందని సితార ఎంటర్ టైన్ మెంట్స్ తెలిపింది. ఇప్పటికే విడుదలైన భీష్మ టీజర్, పాటలకి మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ తో సినిమాపై ఓ అంచనా రానుంది. ఈ నేపథ్యంలో నితిన్ అభిమానులు, ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. బ్యాచిలర్ గా నితిన్ నుంచి వస్తున్న ఆఖరి సినిమా. ఆ థీమ్ లోనే భీష్మ కథాంశం ఉండటం విశేషం. ఇక ఇటీవల నితిన్ కి నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ లో నితిన్ పెళ్లి జరగనుంది.