కేసీఆర్ దేశానికి ప్రధాని కావాలి


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి ప్రధాని కావాలని ఆకాంక్షించారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. సోమవారం (ఫిబ్రవరి 17) సీఎం కేసీఆర్ పుట్టినరోజుని జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, పలువురు ప్రముఖులు, కార్యకర్తలు, ప్రజల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తాయ్. సీఎం కేసీఆర్ బర్త్ డే రోజున మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన కామెంట్ హైలైట్ గా నిలిచింది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆకాంక్షించారు. అంతేకాదు.. కేసీఆర్‌ ఇంకో 24ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, అదేవిధంగా దేశానికి ప్రధాన మంత్రిగా కూడా కావాలని కోరుకుంటున్నట్లు ప్రశాంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని బంజారాహిల్స్‌లోని తన అధికారిక నివాసంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి మొక్కలు కూడా నాటారు.