‘భీష్మ’ ప్రీ-రిలీజ్ బిజినెస్ ఎంతంటే ?

‘భీష్మ’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు యంగ్ హీరో నితిన్. వెంకీ కడుముల దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రమిది. రష్మిక మందన కథానాయిక. మరో కథానాయికగా హెబ్బా పటేల్ నటించారు. మహతి స్వర భాస్కర్ సంగీతం అందించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. ఈ వారమే భీష్మ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ. 20కోట్ల వరకు జరిగినట్టు సమాచారమ్. తెలుగు థియేట్రికల్ రైట్స్ రూ. 15 కోట్ల వరకు పలికినట్టు తెలుస్తోంది. కర్ణాటక, తమిళనాడు, ఓవర్సీస్ అన్నీ కలుపుకుంటే దాదాపు రూ. 20 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. ఇక భీష్మ సేఫ్ జోన్ లోకి రావాలంటే రూ. 20కోట్లకిపైగా కలెక్షన్స్ తీసుకురావాల్సి ఉంది.
 
నితిన్ జీవితంలో భీష్మ స్పెషల్ సినిమా. ఎందుకంటే ? బ్యాచిలర్ లైఫ్ లో ఆయన చేసిన ఆఖరి సినిమా ఇది. ఏప్రిల్ 16న నితిన్ పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన షాలినిని నితిన్‌ పెళ్లాడనున్నారు. ఇటీవలే వీరి నిశ్చితార్థం జరిగింది. భీష్మ హడావుడి పూర్తి కాగానే పెళ్లి పనుల్లో బిజీ కానున్నాడు నితిన్.