విజయ్‌ అంటే క్రష్‌ ఉంది : రస్మిక

టాలీవుడ్ లో హవా చూపిస్తున్న యంగ్ హీరోయిన్ రష్మిక మందన. 2016లోనే కన్నడ సినిమా ‘కిర్రాక్ పార్టీ’ ద్వారా తెరకు పరిచయం అయింది రస్మిక. ఆ తర్వాత ఛలో సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చింది. గీత గోవిందం సినిమాలతో ఈ భామ ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. ఆ తర్వాత మహేష్‌బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’లో కనిపించిన ఆమె ఇమేజ్‌ అమాంతం పెరిగిపోయింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళంలోనూ ఆఫర్లు క్యూ కట్టడంతో ఆమె యమ బిజీ అయిపోయింది. ఆమె నటించిన భీష్మ చిత్రం ఈ వారమే (ఫిబ్రవరి 14) ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న రస్మిక తన పర్సనల్ విషయాలని ప్రేక్షకులతో పంచుకుంది. ‘చిన్నప్పట్నుంచీ విజయ్‌ సర్ అంటే క్రష్‌ ఉంది. ఆయనతో కలిసి బిగిల్‌ సినిమాలో నన్ను భాగస్వామి కావాలని చాలామంది కోరారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో చేయడం కుదరలేదు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం త్వరలోనే వస్తుందని అనుకుంటున్నా’నని రస్మిక తెలిపింది.