తొలి టెస్ట్ : భారీ ఆధిక్యం దిశగా కివీస్

టెస్ట్ సిరీస్ ని పేలవంగా ఆరంభించింది టీమిండియా. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ కి దిగిన కోహ్లీ సేన 165 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. రహానే 46, పంత్ 19 పరుగులతో పోరాడే ప్రయత్నం చేశారు. కానీ, వీరిద్దరి మధ్య సమన్వయ లోపం వలన పంత్ రన్ అవుటయ్యాడు. ఆ తర్వాత టపా టపా వికెట్లు పడిపోయాయ్. ఆఖరులో షమీ 20 బ్యాట్ రులిపించడంతో టీమిండియా 165 పరుగులు చేయగలిగింది. 

అనంతరం బరిలోకి దిగిన కివీస్ జాగ్రత్తగా ఆడింది. 26 పరుగుల వద్ద తొలి వికెట్ గా లాథమ్ అవుటైన వన్ డౌన్ లో వచ్చిన విలియమ్ సన్ 87 (నాటౌట్) ఇన్నింగ్స్ ని నిర్మిస్తున్నారు. ప్రసుత్తం కివీస్ 3 వికెట్లు కోల్పోయి 185 పరుగులతో ఆటని కొనసాగిస్తోంది. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా మరోసారి పేలవ ఫామ్ ని కొనసాగిస్తున్నాడు.