రియాలిటీ షోకు హోస్టుగా సమంత

స్టార్ హీరోయిన్ సమంత నీరు లాంటిది. ఏ పాత్రలో పోస్తే ఆ ఆకారంలో ఇమిడిపోతుంటుంది. ఇప్పటివరకు ఎన్నో విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకుంది. త్వరలో ఆమె ఓ రియాల్టీ షోకి హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్టు సమాచారమ్. అలాగని.. అది తెలుగు బిగ్ బాస్ సీజన్4 కాదు. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌పై త్వరలోనే ప్రసారమయ్యే ఓ రియాలిటీ షోకు హోస్టుగా సమంతా వ్యవహరించనుందని తెలుస్తోంది. ఆ రియాల్టీ షో అచ్చం కింగ్  నాగార్జున వ్యాఖ్యాతగా చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ మాదిరిగా ఉంటుందని సమాచారమ్. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరోవైపు సమంత రెండు తమిళ సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక సినిమాలో ఆమె నయనతారతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది. విఘ్నేశ్ శివన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక మరో సినిమాలో ఆమె హీరో ప్రసన్న జోడీగా కనిపించనుంది. ఈ సినిమాకి అశ్విన్ శరవణన్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. గతంలో తమిళంలో నయనతార ప్రధాన పాత్రధారిగా అయన రూపొందించిన ‘మాయ’ అక్కడ ఘన విజయాన్ని సాధించింది. అదే సినిమా తెలుగులో ‘మయూరి’గా విజయవంతమైంది. ఇప్పుడు అదే దర్శకుడి సినిమాలో సమంత చేయనుంది. ఇక శర్వానంద్-సమంత జంటగా నటించిన జాను ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి సినిమా అనిపించుకుంది. కానీ, కమర్షియల్ గా హిట్ కాలేదని తెలుస్తోంది.