ఇవాంక డ్రెస్ ధరెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !


అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీ కలిసి భారత పర్యటనకి విచ్చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ దంపతులు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమంలో ట్రంప్ దంపతులిద్దరూ కాసేపు చెరఖాను తిప్పుతూ నూలు వడికారు. అనంతరం ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం జరుగుతున్న మొతెరా స్టేడియంలో ట్రంప్ కుమార్తె ఇవాంక సెల్ఫీలు దిగుతూ ఉత్సాహంగా కనిపించారు.

ఇక ఆమె ధరించిన మిడ్డీ డ్రెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ డ్రెస్ ధర అక్షరాల రూ.1.7లక్షలని చెబుతున్నారు. గతంలో 2019లో అర్జెంటీనా వెళ్లినప్పుడు చివరిసారిగా ఆమె ఈ డ్రెస్‌ ధరించారు. మళ్లీ ఇప్పుడు ఆ క్లాస్ట్లీ డ్రెస్ తో భారత పర్యటనకి విచ్చేశారు. ఇక ఇవాంక భారత్ లో పర్యటించడం ఇది రెండోసారి. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యుయర్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, మంత్రి కేటీఆర్‌తో  కలిసి ఇవాంక పాల్గొన్న సంగతి తెలిసిందే.