‘తలైవి’ కొత్త లుక్‌ అదిరింది 

దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’లో బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగన రనౌత్ ప్రధానపాతరలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఎ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎంజీఆర్‌గా అరవిందస్వామి నటిస్తున్నారు. ఈ సినిమాకు బాహుబలి, మణికర్ణిక లాంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాలకు కథ అందించిన కె.వి.విజేంద్ర ప్రసాద్‌ కథని అందించారు. విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌.సింగ్‌ నిర్మిస్తున్నారు. జూన్‌ 26న తలైవిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
 
ఈరోజు జయలలిత పుట్టినరోజు సందర్భంగా తలైవి నుంచి కంగనా లుక్ ఒకటి విడుదల చేశారు. తెల్లని చీరలో జయలలిత రూపంలో పూర్తిగా ఇమిడిపోయిన కంగన రనౌత్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది. ఎలాంటి కృత్రిమ అవయవాలు, స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ లేకుండానే, కంగన అమ్మను మరపిస్తోందంటూ కంగన సోదరి రంగోలీ చాందెల్ ట్వీట్‌ చేశారు. నిబ్ధదత ఉంటే ఏదైనా సాధ్యమే అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె విప్లవ నాయకకి నివాళులర్పించారు.