‘రెడ్’ టీజర్ ముహూర్తం ఫిక్స్ 

ఎనర్జిటిక్ హీరో రామ్ తాజా చిత్రం ‘రెడ్’. తమిళ్‌ సూపర్ హిట్ ‘తడమ్’ రిమేక్ ఇది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ కథానాయికలు. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగి తర్వాత రామ్‌-కిశోర్‌ తిరుమల కాంబోలో వస్తున్న సినిమా ఇది. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 28న టీజర్ ని వదలబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. రామ్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టర్ ని షేర్ చేశారు. ‘ఈసారి డబుల్ యాక్షన్.. డబుల్ థ్రిల్లర్’ అని పేర్కొన్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. ఇటీవల ఇటలీలో రెండు పాటలని కూడా చిత్రీకరించారు. మరో పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది.