ఆ ఇద్దరికీ చెక్ పెట్టిన సమంత

టాలీవుడ్ లో పూజా హెగ్డే హవా కొనసాగుతోంది. ఆమె వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రెండోసారి రొమాన్స్ చేసేందుకు రెడీ అయింది. త్రివిక్రమ్-తారక్ కాంబోలో రాబోతున్న రెండో సినిమాకి ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత పూజాకి రస్మిక చెక్ పెట్టింది. తారక్-త్రివిక్రమ్ సినిమా కోసం రష్మికమందని తీసుకొన్నారనే వార్తలు వినిపించాయి. ఇప్పుడీ వీరిద్దరికి సమంత చెక్ పెట్టినట్టు సమాచారమ్.

తారక్-త్రివిక్రమ్ సినిమా కోసం సమంతని తీసుకున్నట్టు సమాచారమ్. తారక్-సమంతలది హిట్ కాంబో. ఇప్పటికే వీరిద్దరు కలిసి నాలుగు సినిమాల్లో నటించారు. బృందావనం, రామయ్య వస్తావయ్యా, జనతా గ్యారేజ్, రభస సినిమాలో తారక్-సమంతల జోడి అలరించింది. ఇప్పుడు ఐదోసారి త్రివిక్రమ్ సినిమా కోసం జతకట్టబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ పనులు పూర్తికాగానే త్రివిక్రమ్ సినిమాని మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకురాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఐతే, దీనిపై చిత్రబృందం నుంచి క్లారిటీ రావాల్సివుంది.