రేపటి నుంచే యాదాద్రి బహ్మ్రోత్సవాలు

తెలంగాణ తిరుపతి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచే ప్రారంభం కానున్నాయి. మార్చి 7 వరకు కొనసాగనున్నాయి. యాదాద్రి బ్రహ్మోత్సవాలు ఏయే రోజున ఏం నిర్వహించనున్నారు అంటే.. ?

*  ఫిబ్రవరి 28న అలంకార వేడుకలు

*  మార్చి 3న ఎదుర్కోలు

* మార్చి 4న తిరుకల్యాణం

* మార్చి 5న శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం

* మార్చి 7న అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించనున్నారు.

ఇక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో జరిపే నిత్య పూజల్లో మార్పులు చేస్తున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ఈ నెల 26 నుంచి మార్చి 7 వరకు శాశ్వత, మొక్కు కల్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన నరసింహ హోమాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు