పృథ్వీ షాకు మళ్లీ గాయం.. రెండో టెస్ట్’కు డౌటే !

టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా మరోసారి గాయపడ్డాడు. న్యూజిలాండ్ తో రెండో టెస్టు కు ముందు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పృథ్వీ షా పాదానికి గాయమైంది. దాంతో అతను గురువారం ప్రాక్టీస్ కి దూరమయ్యాడు. గాయం తీవ్రతని బట్టీ.. రెండో టెస్టుకి అతడిని కొనసాగించాలే లేదా అన్నదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ గాయం ఇబ్బంది పెడితే ఈనెల 29నుండి జరిగే రెండో టెస్టుకు పృథ్వీ దూరం కానున్నాడు. దాంతో అతని స్థానం లో శుభమాన్ గిల్ తుది జట్టులోకి రానున్నాడు.

గత కొంత కాలంగా వరస టెస్టు సిరీస్ లకు ఎంపికవుతున్నా గిల్ బేంచ్ కే పరిమితం అవుతున్నాడు. అవకాశం వస్తే సత్తా చాటాలని ఆశతో ఉన్నాడు. ఇక న్యూజిలాండ్ సిరీస్ లో టీ20 సిరీస్ ని గెలిచిన టీమిండియా.. వన్ డే సిరీస్ ని కోల్పోయింది. మొదటి టెస్ట్ లోనూ ఓడింది. ఈ నేపథ్యంలో రెండో టెస్ట్ లో గెలుపొంది.. సిరీస్ ని డ్రాగా ముగించాలని కోహ్లీ సేన ఆశపడుతోంది.