కేటీఆర్’పై రేవంత్ రెడ్డి ఎటాక్.. అరెస్ట్ !

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి, ఆయన తమ్ముడు అనిల్ కుమార్ రెడ్డిపై భూ ఆక్రమణ ఆరోపణలు వచ్చాయ్. త్వరలోనే తెలంగాణకి కొత్త పీసీసీ చీఫ్ ని ప్రకటించనున్నారు. ఈ పదవికి రేవంత్ రెడ్డి గట్టిపోటీ దారుడుగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయనపై వస్తున్న భూ ఆక్రమణ ఆరోపణలు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారు. ఏకంగా మంత్రి కేటీఆర్ ని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు.

గండిపేట చెరువుకు వెళ్లే దారిలో మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫామ్‌హౌస్ నిర్మించారని ఆరోపిస్తూ.. ఫామ్‌హౌస్ ముట్టడికి రేవంత్ వెళ్లారు. దీంతో సమాచారం అందుకున్నపోలీసులు మార్గం మధ్యలో జన్వాడ వద్ద రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

111జీవోను తుంగలోతొక్కి మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫామ్‌హౌస్ నిర్మించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 25 ఎకరాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా ఫామ్‌హౌస్ నిర్మాణం చేపట్టారని, వాస్తవాలు చెప్పడానికి వస్తే పోలీసులతో అడ్డుకుంటున్నారని రేవంత్ మండిపడ్డారు.