హార్దిక్‌ పాండ్య వీర బాదుడు.. 37 బంతులోనే సెంచరీ !

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య విశ్వరూపం చూపించాడు. డీవై పాటిల్‌ టీ20కప్‌లో ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. కేవలం 37 బంతుల్లో సెంచరీ కొట్టేశాడు. ఈ టోర్నీలో రిలయన్స్‌-1 జట్టు తరఫున ఆడుతున్న హార్దిక్‌ మంగళవారం కాగ్‌తో జరిగిన మ్యాచ్‌లో39 బంతుల్లోనే 105 పరుగులు చేసి సత్తాచాటాడు 10 సిక్సులు, 8 ఫోర్లు ఉన్నాయి.

ఈ మ్యాచ్ లో తొలి బ్యాటింగ్‌ చేసిన రిలయన్స్‌-1 జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 252పరుగులు చేసింది. 151పరుగులకే ఆలౌటైంది. బౌలింగ్‌లోనూ హార్థిక్ పాండ్యా రాణించాడు. ఐదు వికెట్లు తీశాడు. 5 నెలల క్రితం వెన్నుకు శస్త్రచికిత్స చేయించుకున్న హార్థిక్ పాండ్యా ఇటీవలే కోలుకొన్నాడు. కొన్నాళ్ల క్రిందటే ప్రాక్టీస్ మొదలెట్టాడు. సూపర్ ఫామ్ ని అందుకున్నాడు. ఐపీఎల్, వచ్చే టీ20 వరల్డ్ కప్ లో సత్తా చాటడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు పాండ్యా.