లోకేష్’కి కరోనా సోకింది 

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెదేపా యువనేత నారా లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో 4.5 లక్షల మంది వాలంటీర్లపై టీడీపీ నేతలు చేస్తోన్న విమర్శలకు ఆయన కౌంటర్‌ ఇస్తూ ట్వీట్ చేశారు. లోకేష్ కి కరోనా వైరస్ తో లింక్ చేస్తూ విజయసాయి చేసిన ట్విట్ వైరల్ అవుతోంది. 

‘మాలోకాన్ని కరోనా క్వారంటైన్ వార్డులో పెట్టాలి. వ్యాధి లక్షణాలేవీ బయటకు కనిపించకున్నా అతని నోటి దూల సమాజంలో అశాంతిని ప్రేరేపించేలా ఉంది. అత్యంత నిబద్ధతతో ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్న 4.5 లక్షల మంది వాలంటీర్లను రేపిస్టులు, దండుపాళ్యం క్రిమినల్స్ అని తిట్టి పోస్తున్నాడు’ అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.