అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణ మహోత్సవం  


యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జ‌రుగుతోంది. స్వామివారి కళ్యాణమహోత్సవంలో దేవ‌దాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి దంప‌తులు పాల్గొన్నారు. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స్వామి వారికి ప్ర‌భుత్వం త‌ర‌పున‌ పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునితా మహెందర్ రెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

గత నెల 26 నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. మార్చి 7 వరకు కొనసాగనున్నాయి. రేపు (మార్చి 5) శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ నెల7న అష్టోత్తర శతఘటాభిషేకంతో వార్షిక బ్రహ్మోత్సవం ముగుస్తుంది.