టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో టీమిండియా

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఫైనల్‌ కు చేరింది. భారత్‌ X ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరగాల్సిన తొలి సెమీఫైనల్‌ను వర్షం కారణంగా రద్దు చేశారు. దీంతో మెరుగైన రన్‌రేట్‌ కారణంగా టీమిండియా (8) ఫైనల్ కు అర్హత సాధించింది. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్ కి చేరడం ఇదే తొలిసారి.

మరికొద్దిసేపట్లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియాల మధ్య రెండో సెమీస్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కి వర్షం అడ్డంకిగా ఉంది. మ్యాచ్ జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రన్ రేటులో ఆస్ట్రేలియా (6) కంటే మెరుగైన రన్ రేటు ఉన్న దక్షిణాఫ్రికా (7) ఫైనల్ కి చేరనుంది. దీంతో.. ఈ ఆదివారం ఫైనల్ లో భారత్-దక్షిణాఫికా తలపడనున్నాయ్.