కంగనా మరో అనుష్క కానుందా ?

స్వీటీ అనుష్క ‘జీరో సైజ్’ సినిమా కోసం భారీగా బరువు పెరిగిన సంగతి తెలిసిందే. ఆ బరువులు తగ్గించుకోవడానికి ఇప్పటికీ కష్టపడుతూనే ఉంది. కానీ మునుపటి ఫిజిక్ ని అందుకోలేకపోతుంది. ఇప్పుడు బాలీవుడ్ క్వీన్ కంగనా కూడా భారీగా బరువు పెరిగిందట. కంగనా ప్రధాన పాత్రలో జయలలిత బయోపిక్ ‘తలైవి’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా కోసం కంగనా ఏకంగా 20 కేజీల బరువు పెరిగిందట. తాజాగా కంగనా సోదరి రంగోలి చందేల్ తన ట్విట్టర్ వేదికగా తలైవీ సెట్‌లో కంగనా రనౌత్ దిగిన పిక్స్ షేర్ చేసింది. ఈ సినిమా కోసం కంగనా ఏకంగా 20 కేజీల బరువు పెరిగింది అని పేర్కొంది. తేజన్‌, దాకడ్ సినిమాలకి ముందు కంగనా ఈ నిర్ణయం తీసుకోవడం  విశేషం. తలైవి చిత్రానికి బాహుబలి రచయిత విజేంద్ర ప్రసాద్ కథని అందించారు. జూన్ 26న తలైవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.