హార్థిక్ విధ్వంసం : 55 బంతుల్లో 158 నాటౌట్ 

గాయం నుంచి పూర్తిగా కోలుకొని భారత జట్టులోకి రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న హార్డ్ హిట్టర్ హార్థిక్ పాండ్యా డీవీ పాటిల్‌ టీ20 కప్‌లో దుమ్మురేపుతున్నాడు. రిలయన్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హార్దిక్‌ బీపీసీఎల్ జట్టుతో జరిగిన సెమీస్ లో వీరవిహారం చేశాడు. కేవలం 55 బంతుల్లో 158 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 6ఫోర్లు, 20సిక్సర్లు ఉన్నాయి.

10/2తో జట్టు కష్టాల్లో ఉన్న దశలో క్రీజులోకి వచ్చిన పాండ్య బౌలర్లను ఉతికారేశాడు. హార్దిక్‌ వీరవిహారంతో రిలయన్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 238 పరుగులు చేసింది. ఛేదనలో బీపీసీఎల్‌ జట్టు 15.4 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. దీంతో రిలయన్స్‌ టీమ్‌ 134 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.