మనోజ్’ని సంతోషపెట్టిన రామ్ చరణ్

మంచు మనోజ్ ని సంతోషపెట్టారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. చాలా గ్యాప్ తర్వాత మంచు మనోజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం  ‘అహం బ్రహ్మాస్మి’. శనివారం ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముహూర్తపు షాట్‌కి రామ్‌చరణ్‌ క్లాప్‌ కొట్టగా.. సుస్మితా కొణిదెల, మంచు లక్ష్మి కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు.
 
శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి దర్శకత్వం వహించనున్న ‘అహం బ్రహ్మాస్మి’ చిత్రాన్ని ఎం.ఎం.ఆర్ట్స్‌ పతాకంపై నిర్మలాదేవి మంచు, మనోజ్‌ నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో ఈ సినిమా రానుంది. ఇందులో మనోజ్‌కు జంటగా ప్రియా భవానీ శంకర్‌ సందడి చేయనున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌లో మనోజ్‌ విభిన్నమైన గెటప్‌లో కనిపించారు. ఇక ముహూర్తపు షాట్ కి చరణ్ రావడంపై మనోజ్ సంతోషం వ్యక్తం చేశారు. చరణ్ తనకి ప్రాణ స్నేహితుడన్నాడు.