మాస్క్ ల కొరత.. ఉపాసన చిట్కా !

ప్రజల్లో కరోనా కలవరం మొదలైంది. కరోనా దాని బారిన పడకుండా ఉండేందుకు చాలామంది సాధారణ మాస్క్‌లతోపాటు ఎన్‌-95 మాస్క్‌లను వాడుతున్నారు. దీంతో ప్రస్తుతం దేశంలో చాలాచోట్ల మాస్క్‌ల కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. మాస్క్‌ల కొరతను దృష్టిలో ఉంచుకుని మెగా పవర్ స్టార్ రామ్ సతీమణి ఉపాసన కొణిదెల సోషల్‌మీడియా వేదికగా ఓ చిట్కా చెప్పారు. ఇన్‌స్టెంట్‌ మాస్క్‌ల గురించి ఓ వీడియో పోస్టు చేశారు. 

‘హాయ్‌ ఆల్‌.. కరోనా గురించి భయం వీడండి. బాధ్యత కలిగిన పౌరుడిగా వ్యవహరించండి. మందుల దుకాణాల్లో మాస్క్‌లు, శానిటైజర్స్‌ సరిగ్గా దొరకడం లేదని చాలా మంది అంటున్నారు. దేశంలో ఎన్‌-95 మాస్క్‌ల కొరత ఉంది. అందరికీ సప్లై చేసేందుకు ఆయా ఫ్యాక్టరీలు ఎంతో వర్క్‌ చేస్తున్నాయి. టిష్యూతో మాస్క్‌లు చేసుకోవడం గురించి ఇటీవల నేను ఆన్‌లైన్‌లో చూశాను. కాబట్టి మాస్క్‌లు ధరించాలని భావించేవారు ఇలా కూడా చేసుకోవచ్చు. మాస్క్‌ను తీసిన వెంటనే బయటపడేయకుండా.. చెత్తబుట్టలో వేయండి. మీకు కానీ, మీ చుట్టూ ఉన్నవారికి కానీ కరోనా లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే మాస్క్‌ను ధరించండి’ అని ఉపాసన తెలిపారు.