చిరంజీవి సినిమాలో ఎన్టీఆర్

టాలీవుడ్ లో పవర్ ఫుల్ కాంబినేషన్ సెట్టయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” సినిమాలో సూపర్ స్టార్ మహేష్ కనిపించబోతున్నట్టు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఓ కీలక పాత్ర కోసం రామ్ చరణ్ ని అనుకుంటే.. ఆయన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్న కారణంగా మహేష్ ని తీసుకున్నారని చెప్పుకొంటున్నారు. 

తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోటున్నాడనే న్యూస్ బయటికొచ్చింది. ఈ యేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల  ముందుకొచ్చిన ‘అల.. వైకుంఠపురంలో’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఏకంగా రూ. 200కోట్లకి పైగా షేర్ ని వసూలు చేసింది. కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డులని బ్రేక్ చేసింది. సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘ఇంటి గుట్టు’ అనే సినిమా నుంచి స్ఫూర్తి పొంది ‘అల.. వైకుంఠపురంలో’ తీశాడు త్రివిక్రమ్. 

ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కోసం ఇలాంటి ఫార్ములానే ఎందుకున్నాడట త్రివిక్రమ్. గతంలో చిరంజీవి నటించిన ‘మంత్రి గారి వియ్యంకుడు’ అనే సినిమా లైన్‌తోనే ఇది తెరకెక్కబోతుందట. మంత్రి కుమారుడికి తన చెల్లిని ఇచ్చి పెళ్లి చేసేందుకు హీరో చేసే ప్రయత్నాలే సినిమా మెయిన్ లైన్ అని అంటున్నారు. ఈ సినిమా కోసం ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇది పొలిటికల్ బేస్‌డ్ మూవీ అనే టాక్ వినిపిస్తోంది. ఇందులో తారక్ పొలిటీషియన్‌గా కనిపిస్తాడని చెప్పుకొంటున్నారు.