దక్షిణాఫ్రికా సిరీస్ హార్ధిక్ పాండ్యా


ఈ నెల 12 నుంచి 18 వరకు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు సునీల్ జోషి నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ భారత జట్టును ప్రకటించింది. హార్దిక్‌ పాండ్యాతో పాటు గాయాలతో జట్టుకు దూరమైన ఓపెనర్ శిఖర్‌ ధావన్‌, పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఎంపికయ్యారు. రోహిత్‌శర్మకు విశ్రాంతి ఇచ్చారు. మార్చి 12న ధర్మశాల వేదికగా తొలి వన్డే, మార్చి 15న లఖ్‌నవూ వేదికగా రెండో వన్డే, మార్చి 18న కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌లో ఆఖరి వన్డే జరగనుంది.

జట్టు వివరాలు :

శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షా, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), కేఎల్ రాహుల్, మనీష్‌ పాండే, శ్రేయస్ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, యుజువేంద్ర చాహల్‌, జస్ప్రీత్ బుమ్రా, నవదీప్‌ సైని, కుల్‌దీప్‌ యాదవ్‌, శుభ్‌మన్‌ గిల్‌