మారుతిరావు పోస్ట్ మార్టమ్ రిపోర్ట్’లో ఏముంది ?

తెలంగాణలో సంచలన సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఖైరతాబాద్ ఆర్యవైశ్య భవన్ లో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఆయన మృతదేహానికి హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.

పోస్ట్ మార్టమ్ ముగిసిన తర్వాత మారుతిరావు మృతదేహాన్ని భార్య గిరిజకు అప్పగించారు. మారుతీరావు మృతదేహాన్ని స్వస్థలం మిర్యాలగూడకు తరలిస్తున్నారు. అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహిస్తారన్నది తెలియాల్సి ఉంది. ఇక మారుతి రావుది హత్యా.. ? ఆత్మహత్యా ?? అన్నది తేలడంలో పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ కీలకంగా మారనుంది. మరీ.. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో ఏముంది ?? అన్నది తెలియాల్సి ఉంది.

ఇక తండ్రి మరణంపై స్పందించిన అమృత.. మీడియా ద్వారానే ఈ విషయం తెలిసిందన్నారు. బహుశా.. ప్రణయ్ ని చంపినందుకు ప్రశ్ఛాతాపంతోనే తన తండ్రి ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అభిప్రాయపడింది. వీలునామా గురించి అడగగా.. దాని గురించి తనకి తెలియదని చెప్పుకొచ్చింది.