మారుతిరావు సుసైడ్ నోట్’లో సంచలన విషయాలు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఖైరతాబాద్ ఆర్యవైశ్య భవన్ లో విషం తాగి ఆత్మహత్యకి పాల్పడ్డారు. గత కొద్దిరోజులుగా తీవ్ర మనస్థాపంతో ఉన్న మారుతీరావు స్నేహితులు, సన్నిహితులతో ఫోనులో మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే ఎవరి దగ్గర ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు ప్రస్తావించలేదు.

ఇక సుసైడ్ నోటు మాత్రంలో సంచలన విషయాలు పేర్కొన్నట్టు తెలుస్తోంది. భార్య గిరిజని క్షమాపణలు కోరిన మారుతిరావు.. కూతురు అమృతని తల్లి దగ్గరకి వెళ్లమని కోరినట్టు తెలుస్తోంది. మారుతి రావు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆయనది ఆత్మహత్యా? లేక సాధారణ మరణమా? అన్న కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఇందులో భాగతం ఆర్యవైశ్య భవన్ సిబ్బందిని, మారుతీరావు కారు డ్రైవర్‌ను ప్రశ్నిస్తున్నారు.