నిర్మాత వెంకటరాజు కన్నుమూత

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. నిర్మాత సి.వెంకట్‌రాజు కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. చెన్నైలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. 

వెంకటేశ్‌ కథానాయకుడిగా నటించిన పవిత్రబంధం, పెళ్లి చేసుకుందాం, ఘర్షణ చిత్రాలకు వెంకట్‌రాజు నిర్మాతగా వ్యవహరించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చక్రం సినిమా కూడా వెంకటరాజునే నిర్మాత. సోమవారం చెన్నైలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.