తండ్రి చివరి కోరిక తీర్చేందుకు అమృత ఓకే.. కానీ !

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు మారుతీ రావు ఆదివారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మారుతీరావు తన సూసైడ్ నోట్ లో భార్య గిరిజని క్షమించమని, కూతురు అమృతని తల్లి దగ్గరికి వెళ్లమని కోరారు. తాజా తండ్రి చివరి కోరికపై అమృత స్పందించింది.

ప్రణయ్ ని చంపాడన్న కోపమే తప్ప.. తండ్రిపై తనకి ఎలాంటి గొడవల్లేవ్. భర్త చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో గత ఏడాదిన్నరగా అనుభవిస్తున్నా. ఆ బాధేమిటో తనకు తెలుసు కాబట్టే అమ్మను పరామర్శించడానికి వెళ్లానని తెలిపింది. ప్రణయ్ కుటుంబాన్ని వదిలి తాను అమ్మ దగ్గరకి వెళ్లను. ఒకవేళ అమ్మ ఇక్కడి వస్తే బాధ్యత తీసుకొంటా. తన భర్త ఇంటికి రావడం ఇష్టంలేకపోతే.. మాతో కలిసి బయట ఉంటానన్న ఓకే చెప్తానని అమృత తెలిపింది.