కరోనా ప్రభావం ఉన్నా.. ఐపీఎల్ జరుగుతుంది : గంగూలీ

ఈనెల 29 నుంచి ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే దేశంలో కరోనా విజృంబిస్తున్న నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా పడొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం నిజమే అన్నట్టుగా.. ఇటీవల మీడియాతో మాట్లాడిన మహారాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడితే.. వైరస్ ప్రభావం అధికంగా ఉంటుందని.. దీంతో ఐపీఎల్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.

ఈ విషయంపై తాజాగా బీసీసీ అధ్యక్షుడు గంగూలీ స్పందించారు. షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ యథావిథిగా జరుగుతుందనిస్పష్టం చేశారు. అలాగే మ్యాచ్ లు జరిగే వేళ కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఇక దేశంలో ఇప్పటి వరకు 42 కరోనా కేసులు నమోదయ్యాయి.