బన్నీ-సుకుమార్ పాన్ ఇండియా సినిమా ?

టాలీవుడ్ స్టార్స్ ఇండియన్ సినిమాని ఏలాలనుకొంటున్నారు. పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బాహుబలి సినిమాతో ప్రభాస్, రానా ఇంటర్నేషనల్ స్టార్స్ గా ఎదిగారు. టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ తొలి ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ఫైటర్ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోంది.

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత చేయబోయే సినిమాలని చరణ్, తారక్ ప్యాన్ ఇండియా సినిమాగా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ నుంచి వచ్చే సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగానే రాబోటున్నాయి. మహేష్ పాన్ ఇండియా సినిమా కోసం ప్లాన్ చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అదికూడా సుకుమార్ సినిమానే పాన్ ఇండియా సినిమాగా తీసుకురాబోతున్నట్టు సమాచారమ్. అందుకు తగ్గట్టుగానే నటీనటులని ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కనుంది. ఇందులో బన్నీ ఊరమాస్ పాత్రలో కనిపించనున్నాడు. చిత్తూరు యాసలో మాట్లాడతాడని చెప్పుకొంటున్నారు. బన్నీకి జంటగా రష్మిక మందన నటించనుంది.

ఈ సినిమాలో తమిళ స్టార్ విజయ్ సేతుపతి ఫారెస్ట్ ఆఫీసర్‌గా ఓ కీలక పాత్రలో నటించబోతున్నారట. ఆయనతో పాటు టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతి బాబు, కన్నడ స్టార్ నటుడు రాజ్ దీపక్ శెట్టి విలన్లుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.