విద్యార్థుల తెలంగాణ అసెంబ్లీ ముట్టడి.. తీవ్ర ఉద్రిక్తం !

తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏబీవీపీ విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నిస్తున్నారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో అసెంబ్లీ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యారంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ముందు పలు డిమాండ్లని ఉంచుతున్నారు.

9 వర్సిటీలకి వైన్స్ ఛాన్సర్లని నియమించాలని విద్యార్థులు కోరుతున్నారు. దాంతో పాటు.. జూనియర్, డిగ్రీ లెక్చర్స్, టీచర్ నియామకాలని చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.  స్కాలర్ షిప్ బకాయిలని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆందోళనకి దిగిన విద్యార్థులని పోలీసులు అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్ కి తరలించారు.